నరసాపురంలో పల్స్ పోలియో కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తి
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట మండలం నరసాపురంలో ఆదివారం నిర్వహించనున్న జాతీయ పల్స్ పోలియో కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని వైద్య సిబ్బంది తెలిపారు. గ్రామంలో రెండు పోలియో కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వీఎచ్వో ఐ. తబిత, ఏఎన్ఎం పుష్పలత వెల్లడించారు.
ఐదేళ్లలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని వారు తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. పిల్లల భవిష్యత్తు దృష్ట్యా ఎలాంటి అలసత్వం ప్రదర్శించకుండా ప్రతి చిన్నారిని పోలియో కేంద్రాలకు తీసుకువచ్చి చుక్కలు వేయించాలని కోరారు.
పోలియో రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, గ్రామంలోని అర్హులైన చిన్నారులందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని వైద్య సిబ్బంది పిలుపునిచ్చారు.సందర్భంగా స్థానిక ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, వైద్య సిబ్బంది, ఆశ వర్కర్లు పాల్గొన్నారు