సిపిఎం జిల్లా కార్యదర్శిగా బోడంకి చందుకు సన్మానం చేసిన జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి
మంచిర్యాల పట్టణంలోని జన్మభూమి నగర్ లో ఇటీవల హైదరాబాదులో జరిగిన సిపిఎం పార్టీ రాష్ట్ర స్థాయి సమావేశంలో కోటపల్లి మండలంలోని లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన బోడంకి చెందును సిపిఎం జిల్లా కార్యదర్శిగా ఎన్నిక చేయడంతో బీసీలుగా వర్షం వ్యక్తం చేస్తూ సన్మానించడం జరిగింది ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా సిపిఎం లో కొనసాగుతున్న చందు పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ప్రజా సమస్యలే పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తూన్న చందును గుర్తించి రాష్ట్ర కమిటీ జిల్లా కార్యదర్శిగా నియమించడం సంతోషంగా ఉంది అలాగే సన్మాన గ్రహీత చందు మాట్లాడుతూ సిపిఎం పార్టీగా రాష్ట్రంలో ఎంబీసీ బీసీ ఉద్యమాల్లో బీసీ సబ్ ప్లాన్ ఉద్యమంలో ఎన్నో ఉద్యమాలు చేశానని అలాగే రాబోయే రోజులలో బీసీ ఉద్యమానికి నా వంతు సహాయ సహకారాలు ఉంటాయని తెలియజేశారు అలాగే నాకు సన్మానం నిర్వహించిన పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు జిల్లా అధ్యక్షులు గుమ్ముల శ్రీనివాస్ గజ్జెల్లి వెంకటయ్య మంచిర్ల సాధానందం రామగిరి రాజన్న చారి అశోక వేముల ఎండి అఫ్రోజ్ సన్మాన గ్రహీత బోడంకి చందు తదితరులు పాల్గొన్నారు