www.ntodaynews.com
వెనెజులాను వెంటాడుతున్న భూకంపాలు.. మరోసారి భూమి కంపించింది..!
అంతర్జాతీయం
వెనెజులాలో మరోసారి భూమి కంపించింది. శనివారం ఉదయం సంభవించిన భూకంపం రిక్టర్ స్కేల్పై 4.9 తీవ్రతతో నమోదైంది. ఇప్పటికే రెండ్రోజుల క్రితం వరుసగా సంభవించిన రెండు భారీ భూకంపాలతో దేశం అతలాకుతలమైన సంగతి తెలిసిందే.
ఆ రెండు భూకంపాల ధాటికి ఇప్పటివరకు 920 మంది ప్రాణాలు కోల్పోగా, 3 వేల మందికి పైగా గాయపడ్డారు. అనేక భవనాలు కుప్పకూలడంతో వేలాది మంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
ప్రస్తుతం సహాయక బృందాలు యుద్ధ ప్రాతిపదికన రెస్క్యూ ఆపరేషన్లు కొనసాగిస్తున్నాయి. శిథిలాల మధ్య నుంచి బాధితులను బయటకు తీసేందుకు భారీ ఎత్తున సహాయక చర్యలు చేపట్టారు. వరుస భూకంపాలతో వెనెజులాలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి.