శాంతి దిశగా ఇజ్రాయెల్-లెబనాన్ తొలి అడుగు
దశాబ్దాలుగా ఉద్రిక్తతలు, సరిహద్దు ఘర్షణలతో కొనసాగుతున్న ఇజ్రాయెల్-లెబనాన్ సంబంధాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా మధ్యవర్తిత్వంతో ఇరుదేశాలు శాంతి ఒప్పందం దిశగా తొలి అడుగు వేస్తూ కీలక ఒప్పందంపై సంతకాలు చేశాయి.
అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఇజ్రాయెల్, లెబనాన్ ప్రతినిధులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం సరిహద్దు ఉద్రిక్తతలను తగ్గించడం, భద్రతా సహకారాన్ని పెంపొందించడం, భవిష్యత్తులో శాశ్వత శాంతికి మార్గం సుగమం చేయడమే లక్ష్యంగా రూపొందించినట్లు సమాచారం.
ఈ సందర్భంగా ఇరుదేశాల ప్రతినిధులు మాట్లాడుతూ, "ఇది పూర్తి శాంతి ఒప్పందం కాకపోయినా, శాంతి దిశగా వేసిన తొలి కీలక అడుగు" అని పేర్కొన్నారు.
మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ పరిణామం అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ఒప్పందం అమలు సాఫీగా సాగితే ప్రాంతీయ స్థిరత్వానికి కొత్త ఊపిరి లభించే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.