BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

భూమి కోసం భర్త హత్య.. భార్య, కుమార్తె, అల్లుడు అరెస్ట్

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
26 Jun, 2026 - 10:38 PM
55 వీక్షణలు

నాగర్‌కర్నూల్ జిల్లాలో కుటుంబ కలహాలు, ఆస్తి వివాదం ఓ వ్యక్తి హత్యకు దారితీసింది. ఆవంచ గ్రామానికి చెందిన యాదయ్య(54) హత్య కేసును పోలీసులు ఛేదించి భార్య అలివేల, అల్లుడు ఆంజనేయులు, కుమార్తె పద్యను అరెస్ట్ చేశారు.

పోలీసుల వివరాల ప్రకారం.. 1.5 ఎకరాల భూమిని అల్లుడు పేరుపై రాయాలని కుటుంబ సభ్యులు ఒత్తిడి చేయగా, యాదయ్య నిరాకరించడంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ నేపథ్యంలో జూన్ 23న ముగ్గురు కలిసి ఇంట్లోనే యాదయ్యపై దాడి చేసినట్లు దర్యాప్తులో తేలింది.

అల్లుడు గొంతు పిసికగా, కుమార్తె కాళ్లు పట్టుకుని, భార్య ఇనుప రాడ్‌తో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. తీవ్ర గాయాలతో యాదయ్య అక్కడికక్కడే మృతి చెందినట్లు వెల్లడించారు.

హత్యను సహజ మరణంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించినప్పటికీ, మృతదేహానికి స్నానం చేయించే సమయంలో గాయాలను గుర్తించిన బంధువులకు అనుమానం రావడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు జూన్ 26న ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.

కేసు వివరాలను నాగర్‌కర్నూల్ డీఎస్పీ బుర్రి శ్రీనివాసులు వెల్లడించారు. అరెస్టు ప్రక్రియలో సీఐ అశోక్ రెడ్డి, తిమ్మాజిపేట ఎస్సై శ్రీనివాసరావు పాల్గొన్నారు.