BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమం.. ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలి చాట్రాయి ఎంపీడీవో బళ్ళా రాజు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 Jun, 2026 - 11:00 AM
65 వీక్షణలు

దేశవ్యాప్తంగా ఆదివారం నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని చాట్రాయి మండలంలోని ప్రతి తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండల ఎంపీడీవో బళ్ళా రాజు కోరారు.

0 నుంచి 5 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి చిన్నారికి సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రులు, అంగన్‌వాడీ కేంద్రాలు, బస్‌స్టాండ్లు, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పోలియో బూత్‌లలో తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని ఆయన సూచించారు.

గతంలో పిల్లలకు పోలియో చుక్కలు వేసినా, పల్స్ పోలియో కార్యక్రమంలో మరోసారి చుక్కలు వేయించడం అత్యంత అవసరమని తెలిపారు. పోలియో వంటి ప్రమాదకర వ్యాధిని పూర్తిగా నిర్మూలించాలంటే ప్రతి కుటుంబం బాధ్యతగా కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

తల్లిదండ్రులు ఎలాంటి అపోహలకు తావివ్వకుండా తమ చిన్నారులను పోలియో బూత్‌లకు తీసుకువచ్చి చుక్కలు వేయించాలని, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి సహకరించాలని ఎంపీడీవో బళ్ళా రాజు విజ్ఞప్తి చేశారు.