విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు: శాసన మండలి చైర్మన్
విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు: శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి NTODAY NEWS నల్గొండ
నల్గొండలో ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’ అవగాహన సదస్సు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకగా చేపట్టిన ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’లో భాగంగా విద్యా రంగం బలోపేతమే లక్ష్యంగా స్థానిక సంస్థల ప్రతినిధులకు నిర్వహించిన అవగాహన సదస్సు బుధవారం నల్గొండలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గౌరవనీయులు గుత్తా సుఖేందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, విద్యా ప్రమాణాల మెరుగుదలపై సర్పంచులు, కౌన్సిలర్లకు ఈ సందర్భంగా దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లోని పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంలో స్థానిక ప్రజాప్రతినిధుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. విద్యావంతమైన సమాజమే రాష్ట్ర ప్రగతికి పునాది. పాఠశాలల అభివృద్ధిని ఒక సామాజిక బాధ్యతగా ప్రతి ప్రతినిధి స్వీకరించాలి అని తెలిపారు . అనంతరం నలగొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ విద్యా శాఖకు సంబంధించి పెండింగ్లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజాప్రతినిధులు నిరంతరం పాఠశాలలను సందర్శించి విద్యార్థుల సమస్యలను తెలుసుకోవాలని కోరారు. అనంతరం సర్పంచులు, కౌన్సిలర్లు తమ పరిధిలోని విద్యా సంస్థల అభివృద్ధికి కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సదస్సులో నల్గొండ మున్సిపల్ మేయర్,
బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి అదనపు కలెక్టర్ మరియు డి.ఈ.ఓ నల్గొండ డిప్యూటీ మేయర్
మార్కెట్ కమిటీ చైర్మన్
స్థానిక కార్పొరేటర్లు మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు..