www.ntodaynews.com
తొర్రూర్ పట్టణంలోని నూతనంగా శ్రీకృష్ణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవం
తెలంగాణ
/
మహబూబాబాద్
/
తొర్రూర్
పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి వేణు
తొర్రూర్ పట్టణ కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి గారు ఆసుపత్రిని ప్రారంభించి వైద్య సేవలను పరిశీలించారు..
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ ఆసుపత్రి ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఆధునిక వైద్య సదుపాయాలు అందుబాటులోకి రావడం ఆనందదాయకమని తెలిపారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, వైద్యులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు..