BREAKING
శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి
www.ntodaynews.com

Pulse Polio: ప్రతి చిన్నారికి చుక్కలు వేయించాలని చైర్‌పర్సన్ వేముల నాగలక్ష్మి పిలుపు

తెలంగాణ
/ జగిత్యాల
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
28 Jun, 2026 - 03:40 PM
197 వీక్షణలు

జగిత్యాల జిల్లా, ధర్మపురి | NTODAY NEWS

జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణ పురపాలక సంఘం ఆవరణలో నిర్వహించిన పల్స్ పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్‌పర్సన్ వేముల నాగలక్ష్మి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారులకు పోలియో చుక్కలు వేయించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా చైర్‌పర్సన్ వేముల నాగలక్ష్మి మాట్లాడుతూ, ఆరోగ్యవంతమైన భారతావని నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఐదేళ్లలోపు వయస్సు గల ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించడం తల్లిదండ్రుల ప్రాథమిక బాధ్యత అని స్పష్టం చేశారు.

పోలియో రహిత సమాజ నిర్మాణం కోసం ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ఏ ఒక్క చిన్నారి కూడా పోలియో చుక్కలకు దూరం కాకుండా తల్లిదండ్రులు చొరవ తీసుకోవాలని కోరారు. అలాగే వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి ప్రజలు పూర్తి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ శాఖ చైర్మన్ సంఘనబట్ల దినేష్, మున్సిపల్ కమిషనర్ ఎం. శ్రీనివాస్, కౌన్సిలర్లు వొజ్జెల లక్ష్మణ్, కొమురెల్లి పవనకుమార్, చిపిరిశెట్టి రాజేష్, ముడుసుల ప్రశాంత్, చుక్క సంధ్య, మున్సిపల్ అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది, ప్రజాప్రతినిధులు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.