BREAKING
Pulse Polio: పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి.. చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు Pulse Polio: విజయవాడలో పల్స్ పోలియో కార్యక్రమానికి శ్రీకారం.. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి: కమిషనర్ ధ్యానచంద్ర RTC: విజయవాడ, గుంటూరు బస్సుల కొరతతో ప్రయాణికుల అవస్థలు TDP: ప్రజలతో మమేకమయ్యేందుకు 'సర్' గొప్ప అవకాశం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు Health: పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.. Police News: రాష్ట్ర డీజీపీని మర్యాదపూర్వకంగా కలిసిన అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి Earthquake: ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం.. ఢిల్లీ, కాశ్మీర్‌లో ప్రకంపనలు నంద్యాల యువతకు నిరుద్యోగ 2000 వికాస భృతి నమోదు అవకాశం. 5 సంవత్సరాలలోపు పిల్లలందరికి పోలియో చుక్కలు వేయించండి మీ నేస్తం సేవ సంస్థ ఆధ్వర్యంలో రక్తదానం Pulse Polio: పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి.. చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు Pulse Polio: విజయవాడలో పల్స్ పోలియో కార్యక్రమానికి శ్రీకారం.. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి: కమిషనర్ ధ్యానచంద్ర RTC: విజయవాడ, గుంటూరు బస్సుల కొరతతో ప్రయాణికుల అవస్థలు TDP: ప్రజలతో మమేకమయ్యేందుకు 'సర్' గొప్ప అవకాశం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు Health: పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.. Police News: రాష్ట్ర డీజీపీని మర్యాదపూర్వకంగా కలిసిన అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి Earthquake: ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం.. ఢిల్లీ, కాశ్మీర్‌లో ప్రకంపనలు నంద్యాల యువతకు నిరుద్యోగ 2000 వికాస భృతి నమోదు అవకాశం. 5 సంవత్సరాలలోపు పిల్లలందరికి పోలియో చుక్కలు వేయించండి మీ నేస్తం సేవ సంస్థ ఆధ్వర్యంలో రక్తదానం
www.ntodaynews.com

Voter List Revision: రాజక్కపల్లిలో ఓటర్ల జాబితా సవరణపై అవగాహన సదస్సు.. కీలక సూచనలు చేసిన ఎంఆర్ఓ శేఖర్

తెలంగాణ
/ జగిత్యాల
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
28 Jun, 2026 - 06:28 PM
44 వీక్షణలు

రాజక్కపల్లి | NTODAY NEWS

భారత ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (Special Intensive Revision - SIR) కార్యక్రమంలో భాగంగా రాజక్కపల్లి గ్రామంలో ఆదివారం ఓటర్ల జాబితా సవరణపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంఆర్ఓ శేఖర్ ముఖ్య అతిథిగా హాజరుకాగా, గ్రామ సర్పంచ్ దోరిశెట్టి మల్లేశం అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా ఎంఆర్ఓ శేఖర్ మాట్లాడుతూ, ఓటరు నమోదు ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా సాగాలని, అర్హులైన ప్రతి ఒక్కరూ సరైన వివరాలతో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.

ఓటరు నమోదు సమయంలో ప్రతి ఓటరు తమ పాత ఫోటోతో పాటు ప్రస్తుత ఫోటోను తప్పనిసరిగా జత చేయాలని తెలిపారు. అలాగే పుట్టిన తేదీ, ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, తల్లిదండ్రుల వివరాలను సక్రమంగా నమోదు చేయాలని సూచించారు.

వివాహితులు తమ జీవిత భాగస్వామి వివరాలను తప్పనిసరిగా పొందుపరచాలని, అలాగే 2002లో నిర్వహించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఓటరు జాబితాలో ఉన్న తల్లిదండ్రులు లేదా తాతమ్మల (గ్రాండ్ పేరెంట్స్) వివరాలను ఎన్యూమరేషన్ ఫారంలో నమోదు చేయడం అవసరమని వివరించారు.

ఓటరు జాబితాను తప్పులు లేకుండా, మరింత పారదర్శకంగా రూపొందించేందుకు గ్రామ ప్రజలందరూ సహకరించాలని ఎంఆర్ఓ పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో బీఎల్‌ఓ దోరిశెట్టి తిరుమల, ఆర్‌ఐ రామిరెడ్డి, మహేశ్ తదితర అధికారులు, గ్రామ పెద్దలు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.