BREAKING
తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన మహిళను ప్రేమ పేరుతో మోసం....కేసు నమోదు చేసిన పోలీసులు పోరుమామిళ్లలోని ప్రత్యేక పూజలు నిర్వహించిన దిల్ రాజు బీరంగుడా నుంచి క్రిష్టారెడ్డి పేట వరకు స్ట్రీట్ లైట్స్ మరమ్మతులు పూర్తి హరీశ్‌రావు అరెస్ట్‌పై ఆందోళన తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన మహిళను ప్రేమ పేరుతో మోసం....కేసు నమోదు చేసిన పోలీసులు పోరుమామిళ్లలోని ప్రత్యేక పూజలు నిర్వహించిన దిల్ రాజు బీరంగుడా నుంచి క్రిష్టారెడ్డి పేట వరకు స్ట్రీట్ లైట్స్ మరమ్మతులు పూర్తి హరీశ్‌రావు అరెస్ట్‌పై ఆందోళన
www.ntodaynews.com

Pulse Polio: తొర్రూర్‌లో పల్స్ పోలియో కార్యక్రమం.. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలని పిలుపు

తెలంగాణ
/ మహబూబాబాద్ / తొర్రూర్
Reporter
బోధపల్లి వేణు పాలకుర్తి నియోజకవర్గ ప్రతినిధి
28 Jun, 2026 - 02:36 PM
67 వీక్షణలు

మహబూబాబాద్ జిల్లా, తొర్రూర్ | NTODAY NEWS

రిపోర్టర్: వేణు

మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ పట్టణంలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో తొర్రూర్ మున్సిపల్ 13వ వార్డు కౌన్సిలర్ బసనబోయిన ఐలమ్మ యాదవ్, తొర్రూర్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు జక్కన్న మహబూబ్ రెడ్డి పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. చిన్నారుల ఆరోగ్య పరిరక్షణలో పల్స్ పోలియో కార్యక్రమం ఎంతో కీలకమని, తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయకుండా ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో తొర్రూర్ పట్టణ యువజన నాయకులు బసనబోయిన రాజేష్ యాదవ్, వెన్నం సోమిరెడ్డి, తొర్రూర్ పట్టణ యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బసనబోయిన మహేష్ యాదవ్, యర్రం రాజు యాదవ్, జగన్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది, పార్టీ నాయకులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.