Vijayawada: కాపు చైతన్య రథం ఘన విజయం.. వేలాదిగా హాజరైన కాపు సామాజిక వర్గం
విజయవాడ | NTODAY NEWS
విజయవాడలో నిర్వహించిన కాపు చైతన్య రథం కార్యక్రమం ఘన విజయాన్ని సాధించింది. ఈ సభకు కాపు, తెలగ, బలిజ, ఒంటరి, తూర్పు కాపు, మున్నూరు కాపు సామాజిక వర్గాలకు చెందిన వేలాది మంది హాజరై తమ ఐక్యతను చాటిచెప్పారు.
శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి రాష్ట్రంలోని పలు ప్రాంతాల వరకు పెద్ద ఎత్తున ప్రజలు ఈ కార్యక్రమానికి తరలివచ్చారు. సభలో పాల్గొన్న పలువురు "మా కాపుల మద్దతు పవన్ కళ్యాణ్కే.. చావైనా, బతుకైనా ఆయనతోనే" అంటూ నినాదాలు చేశారు.
అలాగే "జోహార్ వంగవీటి మోహన రంగా", "జిందాబాద్ జనసేన", "జై పవన్ కళ్యాణ్" నినాదాలతో సభా ప్రాంగణం మార్మోగింది.
ఈ కార్యక్రమంలో నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండల జనసేన పార్టీ నాయకుడు సవరం రామారావు పాల్గొని సభ విజయవంతం కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
ఇలాంటి భారీ స్థాయిలో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులు అమ్మ శ్రీనివాస్, తోట భాస్కర్లకు నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండల జనసేన పార్టీ తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. కాపు సమాజ ఐక్యతను మరింత బలోపేతం చేసే దిశగా ఈ సభ ఒక ముఖ్యమైన వేదికగా నిలిచిందని పేర్కొన్నారు.