రాష్ట్ర భవిష్యత్తు కోసం సీఎం కృషి..
దేశంలోని ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్టెల్, భారతీ ఎంటర్ప్రైజెస్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ సునీల్ భారతీ మిట్టల్ను రాష్ట్రంలో పెట్టుబడుల కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆహ్వానించారు.
ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్లో డిజిటల్ మౌలిక సదుపాయాల బలోపేతం, ప్రజలకు మెరుగైన కనెక్టివిటీ, లాస్ట్-మైల్ ఇంటర్నెట్ సేవల విస్తరణ, మొబైల్ టవర్ కనెక్టివిటీ పెంపు, డేటా సెంటర్ల ఏర్పాటు, సముద్రగర్భ ఇంటర్నెట్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్లో పెట్టుబడులు, అలాగే మొబైల్ సర్వీస్ ఆపరేటర్లకు వ్యాపార సౌలభ్యాన్ని మరింత మెరుగుపరచడం వంటి కీలక అంశాలపై దాదాపు మూడు గంటలపాటు విస్తృతంగా చర్చించారు.
సమావేశం ముగిసిన తర్వాత కేవలం మర్యాదపూర్వకంగా వీడ్కోలు చెప్పడం కాకుండా, స్వయంగా గేటు వరకు వెళ్లి, కారు ఎక్కే వరకు దగ్గర ఉండి సునీల్ భారతీ మిట్టల్కు వీడ్కోలు పలికిన ముఖ్యమంత్రి వ్యవహారశైలి ప్రత్యేకంగా నిలిచింది.
ఆదివారం, సెలవు దినం అనే తేడా లేకుండా రోజుకు 16 గంటలపాటు పనిచేస్తూ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్న నాయకత్వానికి ఇది మరో ఉదాహరణగా పలువురు పేర్కొంటున్నారు.
ఇది వ్యక్తిగత ప్రయోజనం కోసం కాదు… రాష్ట్ర భవిష్యత్తు కోసం చేస్తున్న కృషి.