BREAKING
వర్షాకాలంలో డ్రైన్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎంపీ కేశినేని చిన్ని Vijayawada: ఇంద్రకీలాద్రిపై వైభవంగా ఏరువాక పౌర్ణమి వేడుకలు.. రైతు మహిళలకు పవిత్ర వడ్ల పంపిణీ Nandyal: నేషనల్ హైవే 167K పనులు వేగవంతం.. గాలేరు నదిపై కొత్త వంతెన నిర్మాణం Hyderabad: వీ వైశ్య గ్లోబల్ కాంక్లేవ్–2026 విజయవంతం.. Pulse Polio: పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి.. చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు Pulse Polio: విజయవాడలో పల్స్ పోలియో కార్యక్రమానికి శ్రీకారం.. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి: కమిషనర్ ధ్యానచంద్ర RTC: విజయవాడ, గుంటూరు బస్సుల కొరతతో ప్రయాణికుల అవస్థలు TDP: ప్రజలతో మమేకమయ్యేందుకు 'సర్' గొప్ప అవకాశం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు Health: పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.. వర్షాకాలంలో డ్రైన్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎంపీ కేశినేని చిన్ని Vijayawada: ఇంద్రకీలాద్రిపై వైభవంగా ఏరువాక పౌర్ణమి వేడుకలు.. రైతు మహిళలకు పవిత్ర వడ్ల పంపిణీ Nandyal: నేషనల్ హైవే 167K పనులు వేగవంతం.. గాలేరు నదిపై కొత్త వంతెన నిర్మాణం Hyderabad: వీ వైశ్య గ్లోబల్ కాంక్లేవ్–2026 విజయవంతం.. Pulse Polio: పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి.. చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు Pulse Polio: విజయవాడలో పల్స్ పోలియో కార్యక్రమానికి శ్రీకారం.. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి: కమిషనర్ ధ్యానచంద్ర RTC: విజయవాడ, గుంటూరు బస్సుల కొరతతో ప్రయాణికుల అవస్థలు TDP: ప్రజలతో మమేకమయ్యేందుకు 'సర్' గొప్ప అవకాశం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు Health: పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి..
www.ntodaynews.com

లోపూడి గ్రామంలో ఏరువాక కార్యక్రమం నిర్వహించిన మంత్రి కొలుసు పార్థసారథి

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Jun, 2026 - 04:58 PM
18 వీక్షణలు

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం ముసునూరు మండలం లోపూడి గ్రామంలో ఏరువాక పౌర్ణమి సందర్భంగా రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి భూమాతకు పూజలు నిర్వహించి ఖరీఫ్ సీజన్‌ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎడ్లు, నాగలి, గునపం తదితర వ్యవసాయ పనిముట్లకు పూజలు చేసి, నాగలితో దుక్కి దున్ని రైతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఏరువాక పౌర్ణమి ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి అత్యంత పవిత్రమైన వ్యవసాయ పండుగ అని పేర్కొన్నారు.

రైతు సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి తెలిపారు. ఖరీఫ్ సీజన్‌కు అవసరమైన వరి, పత్తి, మిర్చి, పప్పుధాన్యాల విత్తనాలను 80 శాతం రాయితీపై అందిస్తున్నామని చెప్పారు. అలాగే అన్నదాత సుఖీభవ పథకం కింద అర్హులైన రైతులకు నిధులు విడుదల చేసినట్లు వెల్లడించారు.

ఖరీఫ్-2026 ఉచిత పంట బీమా నమోదు ప్రక్రియ ప్రారంభమైందని, ప్రతి రైతు నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ రసాయన ఎరువులు, పురుగు మందుల వినియోగాన్ని తగ్గించాలని రైతులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ బి. వినూత్న, తెలుగుదేశం మండల అధ్యక్షుడు జి. రఘు, కూటమి నాయకులు, గ్రామ పెద్దలు, రైతులు పాల్గొన్నారు.