www.ntodaynews.com
ఏపీఎంఎస్ యాప్ ద్వారానే యూరియా, డి.ఎ.పి అమ్మకాలు
ఆంధ్రప్రదేశ్
/
ఎన్టీఆర్
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విసన్నపేట మండలం నరసాపురం గ్రామంలో యూరియా, డి.ఎ.పి ఎరువుల అమ్మకాలు తప్పనిసరిగా ఏపీఎంఎస్ యాప్ ద్వారానే నిర్వహించనున్నట్లు సహాయ వ్యవసాయ సంచాలకులు కె. శశికళ తెలిపారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు నానో యూరియా, నానో డి.ఎ.పి ఎరువులను రెండు నుంచి మూడు మోతాదుల్లో తప్పనిసరిగా వినియోగించాలని సూచించారు. అలాగే ఖరీఫ్-2026 పంట నమోదు ప్రక్రియ ప్రారంభమైనందున రైతులందరూ తమ సమీప రైతు సేవా కేంద్రాల్లో ఈ-క్రాప్ నమోదు చేయించుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి జీ. రాజ్యలక్ష్మి, వ్యవసాయ విస్తరణ అధికారి ఉషారాణి, రైతు సేవా కేంద్ర సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.