www.ntodaynews.com
ముళ్లపందిని నాటు తుపాకితో వేటాడిన ఇద్దరికి 14 రోజుల రిమాండ్
ఆంధ్రప్రదేశ్
గుండ్లకమ్మ రేంజ్ పరిధిలోని అంబవరం బీట్ ప్రాంతంలో నాటు తుపాకితో ముళ్లపందిని అక్రమంగా వేటాడి చంపిన ఇద్దరు వ్యక్తులను అటవీ శాఖ అధికారులు అరెస్టు చేశారు.
అరెస్టు చేసిన నిందితులు దిగువమెట్ట గ్రామానికి చెందిన మండ్లా శ్రీనివాసులు, గుర్రం పెద్ద గురవయ్యగా గుర్తించారు.
అటవీ శాఖ అధికారులు నిందితులను గిద్దలూరు అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి వారికి 14 రోజుల రిమాండ్ విధించారు.
అక్రమ వేట, వన్యప్రాణుల సంరక్షణ చట్టాల ఉల్లంఘనపై కేసు నమోదు చేసి తదుపరి విచారణ కొనసాగిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు.