BREAKING
చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు
www.ntodaynews.com

ధర్మపురి ప్రజల గుండెల్లో నిలిచిపోయేలా అభివృద్ధి చేస్తా

తెలంగాణ
/ జగిత్యాల
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
27 Mar, 2026 - 07:24 PM
208 వీక్షణలు

ధర్మపురి ప్రజల గుండెల్లో నిలిచిపోయేలా అభివృద్ధి చేస్తా: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్.

ధర్మపురి:

2009 నుండి ప్రతిపక్షంలో ఉంటూ ధర్మపురి నియోజకవర్గంలోని అనేక ప్రజా సమస్యలపై అవగాహన ఉందని, అన్ని సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతానని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

​శుక్రవారం ధర్మపురి పట్టణంలోని కమలాపూర్ రోడ్డులో ఇళ్లపై ప్రమాదకరంగా ఉన్న 11కేవీ విద్యుత్ లైన్ తొలగింపు పనులు పూర్తి కావడంతో, నూతనంగా ఏర్పాటు చేసిన లైన్‌ను మంత్రి ప్రారంభించారు.

​ఈ సందర్భంగా మంత్రి మాట్లాడిన ముఖ్యాంశాలు:

​30 ఏళ్ల సమస్యకు పరిష్కారం: గత ప్రభుత్వాలు పట్టించుకోని 11కేవీ లైన్ సమస్యను పరిష్కరించడం ద్వారా 110 కుటుంబాలకు ఊరట లభించింది.

​అభివృద్ధి పనులు: ధర్మపురిలో నైట్ కళాశాల, కొత్త డిగ్రీ కళాశాల ఏర్పాటు చేశాం. బస్ డిపో నిర్మాణం, గోదావరి పుష్కరాల కోసం బైపాస్ రోడ్లు, మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తాం.

​విద్యుత్ లైన్ల షిఫ్టింగ్: సుమారు ₹ 4.60 కోట్లతో నియోజకవర్గంలో ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ లైన్ల షిఫ్టింగ్ పనులు జరుగుతున్నాయి.

​పరిహారం చెక్కుల పంపిణీ:

విద్యుత్ షాక్‌తో పశువులను కోల్పోయిన బాధితులకు (అనిల్, విజయ, సత్తయ్య, గంగవ్వలకు తలా ₹ 40,000, గంగన్నకు ₹ 7,000) మంత్రి చెక్కులను అందజేశారు.

​ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వేముల నాగలక్ష్మి, మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుముల లావణ్య, కాంగ్రెస్ నాయకులు మరియు అధికారులు పాల్గొన్నారు.