BREAKING
విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు: శాసన మండలి చైర్మన్ మహబూబాద్ జిల్లాలో గ్రంథాలయం సంస్థ చైర్మన్ ప్రమాణ స్వీకారం తొర్రూరు మండలం 9వ వార్డు కౌన్సిలర్ వివాహ వేడుక నీట్ పేపర్ లీకేజీపై యువజన కాంగ్రెస్ నిరసన జ్వాలలు జర్నలిస్టుల ​హక్కుల పరిరక్షణకు ఏకైక వేదిక టీయుడబ్ల్యూజే (ఐజేయు) ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి విద్యార్థులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మే 17న ఇబ్రహీంపట్నంలో ఏపిడబ్ల్యూజేఎఫ్, ఏపిబీజేఏ ఎన్టీఆర్ జిల్లా మహాసభలు రైతు భరోసా కేంద్రంలో సిబ్బంది గైర్హాజరు.. రైతులు అవస్థలు! ట్రాన్స్‌జెండర్లకు గుడ్‌న్యూస్.. కూటమి సర్కార్ కీలక నిర్ణయం..! విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు: శాసన మండలి చైర్మన్ మహబూబాద్ జిల్లాలో గ్రంథాలయం సంస్థ చైర్మన్ ప్రమాణ స్వీకారం తొర్రూరు మండలం 9వ వార్డు కౌన్సిలర్ వివాహ వేడుక నీట్ పేపర్ లీకేజీపై యువజన కాంగ్రెస్ నిరసన జ్వాలలు జర్నలిస్టుల ​హక్కుల పరిరక్షణకు ఏకైక వేదిక టీయుడబ్ల్యూజే (ఐజేయు) ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి విద్యార్థులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మే 17న ఇబ్రహీంపట్నంలో ఏపిడబ్ల్యూజేఎఫ్, ఏపిబీజేఏ ఎన్టీఆర్ జిల్లా మహాసభలు రైతు భరోసా కేంద్రంలో సిబ్బంది గైర్హాజరు.. రైతులు అవస్థలు! ట్రాన్స్‌జెండర్లకు గుడ్‌న్యూస్.. కూటమి సర్కార్ కీలక నిర్ణయం..!
www.ntodaynews.com

మే 17న ఇబ్రహీంపట్నంలో ఏపిడబ్ల్యూజేఎఫ్, ఏపిబీజేఏ ఎన్టీఆర్ జిల్లా మహాసభలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
13 May, 2026 - 01:37 PM
5 వీక్షణలు

మే 17న ఇబ్రహీంపట్నంలో ఏపిడబ్ల్యూజేఎఫ్, ఏపిబీజేఏ ఎన్టీఆర్ జిల్లా మహాసభలు

ఆహ్వాన పత్రికను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీషా ఐఏఎస్

ఏపీ, విజయవాడ, మే 12: జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం, వృత్తి అభివృద్ధి లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ (ఏపీడబ్ల్యూజేఎఫ్), ఆంధ్రప్రదేశ్ బ్రాడ్‌కాస్ట్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ (ఏపీబీజేఏ) ఆధ్వర్యంలో ఈ నెల 17న ఇబ్రహీంపట్నంలో ఎన్టీఆర్ జిల్లా మహాసభలను ఘనంగా నిర్వహించనున్నారు.

ఈ మహాసభల ఆహ్వాన పత్రికను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీషా ఐఏఎస్ ఆవిష్కరించారు. అనంతరం ఏపీడబ్ల్యూజేఎఫ్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు కలిమి శ్రీ, ప్రధాన కార్యదర్శి ఎం.బి. నాథన్, జిల్లా సెక్రటరీ రాఘవులు కలిసి కలెక్టర్‌తో పాటు ఎంపీ కేశినేని చిన్ని ని మర్యాదపూర్వకంగా కలిసి మహాసభలకు ఆహ్వానించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలు, సంక్షేమ అంశాలు, వృత్తి పరమైన సవాళ్లపై మహాసభల్లో విస్తృతంగా చర్చించనున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టుల ఐక్యతకు ఈ సమావేశాలు వేదికగా నిలుస్తాయని పేర్కొన్నారు.

కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ మైలవరం నియోజకవర్గ అధ్యక్షుడు షేక్ సల్మాన్, కార్యదర్శి వి.సురేష్, సభ్యుడు అవుటి బాబు, ఏపిబీజేఏ మైలవరం నియోజకవర్గ అధ్యక్షుడు వి.వెంకట్, కార్యదర్శి ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. మహాసభలను విజయవంతం చేయడానికి జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.