www.ntodaynews.com
విద్యార్థులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్
విద్యార్థులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
అడవితల్లి బాట కార్యక్రమంలో పెదపాడు గ్రామ విద్యార్థులకు ఇచ్చిన హామీని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిలబెట్టుకున్నారు. గ్రామంలో కొత్త పాఠశాల భవనం నిర్మాణం పూర్తై విద్యార్థులకు అందుబాటులోకి వచ్చింది. రూ.17.50 లక్షల వ్యయంతో నిర్మించిన ఈ నూతన భవనం ఆధునిక సౌకర్యాలతో సిద్ధమై, గ్రామ విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణాన్ని కల్పించనుంది.
గ్రామ ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు ఈ అభివృద్ధిపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ విద్యా రంగానికి ప్రాధాన్యత ఇస్తున్నారని స్థానికులు పేర్కొన్నారు.