BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

తెలంగాణలో చారిత్రక కట్టడాల పరిరక్షణకు కేంద్రం ప్రాధాన్యం

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
03 Aug, 2026 - 08:50 PM
15 వీక్షణలు

తెలంగాణలో చారిత్రక కట్టడాల పరిరక్షణకు కేంద్రం ప్రాధాన్యం

న్యూఢిల్లీ, ఆగస్టు 3: తెలంగాణలో చారిత్రక కట్టడాల పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నట్లు కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి వెల్లడించారు. లోక్‌సభలో ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా దేశవ్యాప్తంగా 3,688 కేంద్ర రక్షిత స్మారక చిహ్నాలు ఉన్నాయని తెలిపారు. హైదరాబాద్ సర్కిల్ పరిధిలో 2021-22 నుంచి 2025-26 వరకు చారిత్రక కట్టడాల సంరక్షణకు నిధులు కేటాయించినట్లు పేర్కొన్నారు. 2021-22లో రూ.7 కోట్లుగా ఉన్న కేటాయింపులు 2022-23లో రూ.15.50 కోట్లకు పెరగగా, 2025-26లో రూ.14.93 కోట్లు కేటాయించినట్లు వివరించారు. అలాగే 'అడాప్ట్ ఎ హెరిటేజ్ 2.0' కార్యక్రమం ద్వారా చారిత్రక ప్రదేశాల్లో వసతుల మెరుగుదలకు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.

పాఠశాలల్లో డిజిటల్ విద్య విస్తరణకు కేంద్రం చర్యలు

జాతీయ విద్యా విధానం–2020 అమలులో భాగంగా పాఠశాలల్లో డిజిటల్ విద్యను విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి జయంత్ చౌదరి తెలిపారు. తెలంగాణలో 41,762 ఎంపిక చేసిన పాఠశాలల్లో 2,104 స్మార్ట్ తరగతి గదులు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అలాగే 20,490 పాఠశాలలకు కంప్యూటర్ సౌకర్యం, 15,535 పాఠశాలలకు ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. డిజిటల్ బోధనపై ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ అందిస్తున్నామని, 2020-21లో 2,980 మంది శిక్షణ పొందగా, 2021-22లో 75,735 మంది, 2022-23లో 31,273 మంది, 2023-24లో 448 మంది, 2024-25లో 16,618 మంది, 2025-26లో 22,519 మంది ఉపాధ్యాయులు డిజిటల్ శిక్షణ పూర్తి చేసినట్లు వివరించారు.