www.ntodaynews.com
ఏపీ ప్రభుత్వం మరో హామీ అమలు.. వారి ఖాతాల్లో రూ.10 వేలు
ఆంధ్రప్రదేశ్
/
ఆంధ్రప్రదేశ్
AP: కూటమి ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు దిశగా అడుగులు వేస్తోంది. రాష్ట్రంలోని జూనియర్ న్యాయవాదులకు ప్రస్తుతం అందిస్తున్న నెలవారీ స్టైఫండ్ను రూ.5,000 నుంచి రూ.10,000కు పెంచుతున్నట్లు న్యాయశాఖ మంత్రి ఫరూక్ ప్రకటించారు. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు త్వరలో జారీ కానున్నాయి. అలాగే రాష్ట్రవ్యాప్తంగా 96 కొత్త కోర్టులకు ఆమోదం తెలిపిన ప్రభుత్వం, న్యాయశాఖలోని 1,770 ఖాళీల భర్తీకి చర్యలు చేపట్టింది. కోర్టుల మౌలిక వసతుల అభివృద్ధికి రూ.216 కోట్లు కేటాయించగా, లా ఆఫీసర్లు, న్యాయాధికారులకు వేతనాలు, ఇతర సౌకర్యాలు కూడా పెంచనున్నట్లు వెల్లడించింది.