అక్కపాలెంలో ప్రభుత్వ భూమి ఆక్రమణపై ఆర్డీఓ పరిశీలన
అక్కపాలెంలో ప్రభుత్వ భూమి ఆక్రమణపై ఆర్డీఓ పరిశీలన
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం తిరువూరు మండలం అక్కపాలెం రెవెన్యూ గ్రామంలో ప్రభుత్వ భూమి ఆక్రమణపై అధికారులు చర్యలకు సిద్ధమయ్యారు. గ్రామంలోని ఆర్ఎస్ నెం. 3-1లో ఉన్న 1.80 సెంట్ల ప్రభుత్వ భూమిని బాయన సాంబశివరావు, తోటకూర సత్యవతి అక్రమంగా ఆక్రమించుకున్నారంటూ వచ్చిన ఫిర్యాదుపై తిరువూరు రెవెన్యూ డివిజనల్ అధికారి ఎ. కుమార్ బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రభుత్వ భూములకు రక్షణ కల్పించడంతో పాటు నిబంధనలకు విరుద్ధంగా జరిగిన ఆక్రమణలను తొలగించి భూమిని తిరిగి స్వాధీనం చేసుకునేలా చర్యలు చేపట్టాలని ఆర్డీఓ అధికారులను ఆదేశించారు. ఆక్రమిత భూమిని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకునేందుకు అవసరమైన తదుపరి చర్యలు వెంటనే చేపట్టాలని తిరువూరు తహసీల్దార్కు సూచించారు. ఈ సందర్భంగా గ్రామానికి వచ్చిన ప్రజలు స్పందిస్తూ.. గ్రామంలో ఎక్కడైనా ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురైనట్లు గుర్తిస్తే అధికారుల దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించేందుకు సహకరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్, మండల సర్వేయర్, గ్రామ రెవెన్యూ అధికారి పాల్గొన్నారు.