BREAKING
మీ నేస్తం సేవ సంస్థ ఆధ్వర్యంలో రక్తదానం పాత విధానంలోనే ఉపాధి హామీ పథకం కొనసాగించాలి: జయరామయ్య టిట్కో సమీప చెరువులో అక్రమ మట్టి తరలింపు ఆరోపణలు రాజకీయాల్లో మేడా రీ ఎంట్రీ.. వైసీపీలోనే కొనసాగుతారా? లేక కూటమి వైపు చూస్తారా? ఓట్ల తొలగింపుపై తప్పుడు ప్రచారం నమ్మొద్దు: సబ్ కలెక్టర్ సత్యం,ధర్మం,త్యాగానికి నిలువెత్తు రూపం మొహరం - వెలంపల్లి నియోజకవర్గంలో షర్బత్ పంపిణీ చేసిన మాజీ మంత్రి వెలంపల్లి APSAHPC సభ్యుడిగా డాక్టర్ రెడ్డన్న పాస్‌పోర్ట్ ఫీజుల సవరణ.. జూలై 1 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి చెక్కు బౌన్స్ కేసులో మహిళకు ఏడాది జైలు.. రూ.50 లక్షలు చెల్లించాలని కోర్టు ఆదేశం మొహర్రం సెలవు రోజునూ విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చు.. ఏపీఎస్‌పీడీసీఎల్ ప్రకటన మీ నేస్తం సేవ సంస్థ ఆధ్వర్యంలో రక్తదానం పాత విధానంలోనే ఉపాధి హామీ పథకం కొనసాగించాలి: జయరామయ్య టిట్కో సమీప చెరువులో అక్రమ మట్టి తరలింపు ఆరోపణలు రాజకీయాల్లో మేడా రీ ఎంట్రీ.. వైసీపీలోనే కొనసాగుతారా? లేక కూటమి వైపు చూస్తారా? ఓట్ల తొలగింపుపై తప్పుడు ప్రచారం నమ్మొద్దు: సబ్ కలెక్టర్ సత్యం,ధర్మం,త్యాగానికి నిలువెత్తు రూపం మొహరం - వెలంపల్లి నియోజకవర్గంలో షర్బత్ పంపిణీ చేసిన మాజీ మంత్రి వెలంపల్లి APSAHPC సభ్యుడిగా డాక్టర్ రెడ్డన్న పాస్‌పోర్ట్ ఫీజుల సవరణ.. జూలై 1 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి చెక్కు బౌన్స్ కేసులో మహిళకు ఏడాది జైలు.. రూ.50 లక్షలు చెల్లించాలని కోర్టు ఆదేశం మొహర్రం సెలవు రోజునూ విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చు.. ఏపీఎస్‌పీడీసీఎల్ ప్రకటన
www.ntodaynews.com

కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో క్యాంటీన్ నిర్వహణకు టెండర్లు ఆహ్వానం

ఆంధ్రప్రదేశ్
Reporter
JP.Nagireddy రాయచోటి మండల ప్రతినిధి
26 Jun, 2026 - 06:15 AM
4 వీక్షణలు

అన్నమయ్య జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో క్యాంటీన్ నిర్వహణకు టెండర్లు ఆహ్వానం

అన్నమయ్య జిల్లా కలెక్టర్ కార్యాలయం, మదనపల్లె ప్రాంగణంలో క్యాంటీన్ నిర్వహణకు ఆసక్తి గల వ్యక్తులు / సంస్థల నుండి టెండర్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

కార్యాలయానికి వచ్చే అధికారులు, ఉద్యోగులు, సందర్శకులు మరియు ప్రజలకు నాణ్యమైన ఆహార సేవలు అందించే ఉద్దేశంతో క్యాంటీన్ నిర్వహణ చేపట్టనున్నట్లు తెలిపారు. టెండర్ నిబంధనల ప్రకారం క్యాంటీన్ నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు టెండర్ పొందిన వ్యక్తి లేదా సంస్థ స్వంత వ్యయంతో చేపట్టవలసి ఉంటుంది. నాణ్యమైన ఆహార పదార్థాలు, పరిశుభ్రత, సేవా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని సూచించారు.

ఆసక్తి గల అభ్యర్థులు 24-06-2026 నుండి 29-06-2026 సాయంత్రం వరకు తమ టెండర్ దరఖాస్తులను జిల్లా కలెక్టర్ కార్యాలయం, మదనపల్లెలో సమర్పించవచ్చని తెలిపారు. టెండర్ల పరిశీలన 30-06-2026 ఉదయం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించబడుతుందని, ఏ టెండర్‌నైనా కారణం చూపకుండా అంగీకరించే లేదా తిరస్కరించే పూర్తి హక్కు జిల్లా పరిపాలనకు ఉంటుందని కలెక్టర్ తెలిపారు. ఏదేని ఇతర వివరాలకు కలెక్టర్ వారి కార్యాలయంలో సంప్రదించాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.