www.ntodaynews.com
అత్యవసర సేవల నంబర్లపై విద్యార్థినులకు అవగాహన
ఆంధ్రప్రదేశ్
అత్యవసర సేవల నంబర్లపై విద్యార్థినులకు అవగాహన కార్యక్రమం
కలకడ మండలంలోని కస్తూర్భా గాంధీ బాలికల పాఠశాలలో సీఐ లక్ష్మణ్, ఎస్ఐ రామాంజనేయులు ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బాలల భద్రత, బాల్య వివాహాల నివారణ, పోక్సో చట్టం, సైబర్ నేరాలపై విద్యార్థినులకు వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడే 112, బాలల సహాయ హెల్ప్లైన్ 1098, సైబర్ మోసాల ఫిర్యాదుల కోసం 1930 నంబర్ల వినియోగంపై అవగాహన కల్పించారు. అపరిచితుల మోసాలకు గురికాకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. విద్యార్థినులు కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని సందేహాలను నివృత్తి చేసుకున్నారు.