Breaking News
తాజా బ్రేకింగ్ వార్తలు ఇక్కడ అప్‌డేట్ చేయబడతాయి...
www.ntodaynews.com

సర్వేల్ -మర్రిగుడం గ్రామ ప్రజల దాహం తీర్చిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు:- చలమల్ల కృష్ణ రెడ్డి

తెలంగాణ
NTODAY NEWS OFFICIAL
NTODAY NEWS OFFICIAL
03 Oct, 2024
178 వీక్షణలు
ఎన్ టుడే న్యూస్ మునుగోడు ప్రతినిధి - కుర్మతి రమేష్ సంస్థాన్ నారాయణపురం మండలం:-ప్రపంచంలోనే అత్యధికంగా ఫ్లోరైడ్ మునుగోడు నియోజకవర్గ ప్రాంతంలో ఉండటం చూసి చలించిపోయి తన స్వంత నిధులచే సుమారు 8 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వాటర్ ప్లాంట్ ఎర్పాటు చేసి యాదాద్రి భువనగిరి జిల్లా, నారాయణపురం మండలం, సర్వేల్ -మర్రిగూడం గ్రామ ప్రజల త్రాగునీటి కష్టాలు తీర్చిన ఉమ్మడి సర్వేల్ గ్రామ ముద్దుబిడ్డ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత చలమల్ల కృష్ణ రెడ్డి వారికి గ్రామ ప్రజలు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ రానున్న రోజుల్లో వారు మునుగోడు నియోజకవర్గానికి దిక్సూచిగా నిలబడితే మునుగోడు నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుంది. ఈ కార్యక్రమంలో వెల్లంకి నరేష్, 12వ వార్డు మాజీ వార్డ్ నెంబర్ ఎల్లంకి రాజు, మాజీ 11వ వార్డ్ ఈసం పరమేష్ (వజ్రం పులి) చిలక రాజు లక్ష్మయ్య, వేనుముల శేఖర్ రెడ్డి, గుత్తా కృష్ణారెడ్డి, శ్రీరామోజు హరి, కొండ లింగస్వామి, నలపరాజు పద్మ స్వామి, ఎల్లంకి జంగయ్య, వెల్లంకి వెంకటేష్, యముడాల నరసింహ, వెల్లంకి రాములు, గడ్డమీద యాదయ్య, కట్టేల లింగస్వామి, పంది లింగయ్య, వడ్డేపల్లి రాజు, వెల్లంకి శంకర్, గుత్తా సీతారాం రెడ్డి, ఉడుగు యాదయ్య, సుక్క పాకీరు, కొలన్ మల్లేష్ గ్రామ మహిళలు, గ్రామ పెద్దలు, కాలనీ వాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.