www.ntodaynews.com
కాంగ్రెస్ సర్కార్ హామీల అమలులో విఫలం
తెలంగాణ
/
తెలంగాణ
/
మంచిర్యాల
మంచిర్యాల (MNCL): ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని బీజేపీ మంచిర్యాల పట్టణ అధ్యక్షుడు అమిరిశెట్టి రాజ్ కుమార్ తీవ్రంగా విమర్శించారు.
సోమవారం మంచిర్యాల పట్టణ బీజేపీ శ్రేణులతో కలిసి ఆయన స్థానిక తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి, ప్రభుత్వ వైఫల్యాలపై నిరసన వ్యక్తం చేస్తూ వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ.. ఆచరణకు సాధ్యం కాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, ఇప్పటి వరకు ఒక్క హామీని కూడా సంపూర్ణంగా నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తోందని ధ్వజమెత్తారు. తక్షణమే ప్రజా సమస్యలను పరిష్కరించి, ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.