BREAKING
పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన మహిళను ప్రేమ పేరుతో మోసం....కేసు నమోదు చేసిన పోలీసులు పోరుమామిళ్లలోని ప్రత్యేక పూజలు నిర్వహించిన దిల్ రాజు బీరంగుడా నుంచి క్రిష్టారెడ్డి పేట వరకు స్ట్రీట్ లైట్స్ మరమ్మతులు పూర్తి హరీశ్‌రావు అరెస్ట్‌పై ఆందోళన కీసర ఎస్ఐ డి జ్ఞానేందర్ రెడ్డికి ముందస్తు రాఖీ శుభాకాంక్షలు తెలిపిన సహచరి ఆర్పీలు హనుమకొండ: కేయూ జంక్షన్ వద్ద ఉద్రిక్తత సీఎం రేవంత్ దిష్టిబొమ్మ దగ్ధం. పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన మహిళను ప్రేమ పేరుతో మోసం....కేసు నమోదు చేసిన పోలీసులు పోరుమామిళ్లలోని ప్రత్యేక పూజలు నిర్వహించిన దిల్ రాజు బీరంగుడా నుంచి క్రిష్టారెడ్డి పేట వరకు స్ట్రీట్ లైట్స్ మరమ్మతులు పూర్తి హరీశ్‌రావు అరెస్ట్‌పై ఆందోళన కీసర ఎస్ఐ డి జ్ఞానేందర్ రెడ్డికి ముందస్తు రాఖీ శుభాకాంక్షలు తెలిపిన సహచరి ఆర్పీలు హనుమకొండ: కేయూ జంక్షన్ వద్ద ఉద్రిక్తత సీఎం రేవంత్ దిష్టిబొమ్మ దగ్ధం.
www.ntodaynews.com

డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
రావిపాటి ప్రభాకరావు చిలకలూరిపేట మండల ప్రతినిధి
13 Jun, 2026 - 10:36 AM
107 వీక్షణలు

పల్నాడు జిల్లాలో డ్వాక్రా గ్రూపు నిధుల దుర్వినియోగం కేసులో రొంపిచర్ల DRDA APM సోమశేఖర్, సీసీ సుబ్బారావుకు పొన్నూరు కోర్టు రిమాండ్ విధించింది.

గతంలో కాకుమాను మండలంలో APMగా పనిచేసిన సోమశేఖర్, సీసీ సుబ్బారావుపై గరికపాడు గ్రామానికి చెందిన డ్వాక్రా గ్రూపు సభ్యులు తమ నిధులను పెద్ద ఎత్తున దుర్వినియోగం చేశారంటూ ఫిర్యాదు చేశారు. ఈ అవకతవకల్లో యానిమేటర్‌తో పాటు ఇద్దరు గ్రూపు లీడర్ల పాత్ర కూడా ఉందని ఆరోపణలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో సోమశేఖర్, సుబ్బారావు, యానిమేటర్, ఇద్దరు గ్రూపు లీడర్లపై కాకుమాను పోలీసులు కేసు నమోదు చేశారు. సోమశేఖర్‌పై నాన్-బెయిలబుల్ కేసు నమోదు కాగా, కోర్టు విచారణలకు హాజరు కాకపోవడంతో పొన్నూరు కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.

వారెంట్ అమలు చేసిన కాకుమాను పోలీసులు ఇద్దరినీ అరెస్ట్ చేసి పొన్నూరు జూనియర్ సివిల్ కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం కోర్టు ఇద్దరికీ రిమాండ్ విధించింది. అనంతరం వారిని గుంటూరు జిల్లా జైలుకు తరలించారు.

ప్రస్తుతం సోమశేఖర్ పల్నాడు జిల్లా రొంపిచర్లలో DRDA APMగా విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం.