డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్
పల్నాడు జిల్లాలో డ్వాక్రా గ్రూపు నిధుల దుర్వినియోగం కేసులో రొంపిచర్ల DRDA APM సోమశేఖర్, సీసీ సుబ్బారావుకు పొన్నూరు కోర్టు రిమాండ్ విధించింది.
గతంలో కాకుమాను మండలంలో APMగా పనిచేసిన సోమశేఖర్, సీసీ సుబ్బారావుపై గరికపాడు గ్రామానికి చెందిన డ్వాక్రా గ్రూపు సభ్యులు తమ నిధులను పెద్ద ఎత్తున దుర్వినియోగం చేశారంటూ ఫిర్యాదు చేశారు. ఈ అవకతవకల్లో యానిమేటర్తో పాటు ఇద్దరు గ్రూపు లీడర్ల పాత్ర కూడా ఉందని ఆరోపణలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో సోమశేఖర్, సుబ్బారావు, యానిమేటర్, ఇద్దరు గ్రూపు లీడర్లపై కాకుమాను పోలీసులు కేసు నమోదు చేశారు. సోమశేఖర్పై నాన్-బెయిలబుల్ కేసు నమోదు కాగా, కోర్టు విచారణలకు హాజరు కాకపోవడంతో పొన్నూరు కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
వారెంట్ అమలు చేసిన కాకుమాను పోలీసులు ఇద్దరినీ అరెస్ట్ చేసి పొన్నూరు జూనియర్ సివిల్ కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం కోర్టు ఇద్దరికీ రిమాండ్ విధించింది. అనంతరం వారిని గుంటూరు జిల్లా జైలుకు తరలించారు.
ప్రస్తుతం సోమశేఖర్ పల్నాడు జిల్లా రొంపిచర్లలో DRDA APMగా విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం.