BREAKING
ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి నూతన తహశీల్దార్‌గా ఎస్. చంద్రశేఖర్ పదవీ బాధ్యతల స్వీకరణ గొల్లపూడి పి.ఏ.సీఎస్ సభ్యులకు రూ.25 లక్షల డివిడెంట్లు. పోలీస్ నియామకాలకు వయోపరిమితి పెంచాలని డీవైఎఫ్‌ఐ డిమాండ్. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి నూతన తహశీల్దార్‌గా ఎస్. చంద్రశేఖర్ పదవీ బాధ్యతల స్వీకరణ గొల్లపూడి పి.ఏ.సీఎస్ సభ్యులకు రూ.25 లక్షల డివిడెంట్లు. పోలీస్ నియామకాలకు వయోపరిమితి పెంచాలని డీవైఎఫ్‌ఐ డిమాండ్.
www.ntodaynews.com

సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..!

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
13 Jun, 2026 - 10:39 AM
11 వీక్షణలు

ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లపై ప్రభుత్వం కీలక నిర్ణయాలు

ఆంధ్రప్రదేశ్ స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఉద్యోగులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న పలు అంశాలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూ కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది.

ప్రభుత్వం త్వరలో సచివాలయ ఉద్యోగులకు నోషనల్ ఇంక్రిమెంట్ అమలు చేయనున్నట్లు సమాచారం. అలాగే ప్రతి శాఖ ఉద్యోగికి ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేయడంతో పాటు అంతర్‌జిల్లా బదిలీలు, స్పౌజ్ ట్రాన్స్‌ఫర్లు అమలుపై కూడా పరిశీలన జరుగుతోంది. ఉద్యోగుల దీర్ఘకాల డిమాండ్ అయిన పే స్కేల్ అమలు కోసం కూడా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించింది.

ఈ సందర్భంగా మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ, వ్యవసాయ, పశుసంవర్ధక, పంచాయతీరాజ్, వైద్య, రెవెన్యూ శాఖలకు చెందిన 7,246 మంది సచివాలయ ఉద్యోగులకు ఇప్పటికే పదోన్నతులు కల్పించినట్లు తెలిపారు.

అదేవిధంగా ఉద్యోగుల పనిభారం తగ్గింపు, సెలవుల ఆమోదంలో సౌలభ్యం, గ్రీవెన్స్‌ల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

సచివాలయ ఉద్యోగుల సంక్షేమం, సేవా భద్రతను మెరుగుపరిచే లక్ష్యంతో ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలు ఉద్యోగుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, బదిలీలకు సంబంధించి త్వరలో అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని ఉద్యోగ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.