కదిరిలో ఆర్టీసీ బస్సు చోరీ.. మదనపల్లిలో బస్సుతో సహా దొంగ పట్టివేత
కదిరిలో ఆర్టీసీ బస్సు చోరీ.. మదనపల్లిలో బస్సుతో సహా దొంగ పట్టివేత
సత్యసాయి జిల్లా కదిరి ఆర్టీసీ డిపోలో శనివారం అర్ధరాత్రి సంచలన ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి డిపోలో ఉన్న ఆర్టీసీ బస్సును చోరీ చేసి మదనపల్లి వైపు తీసుకెళ్లాడు.
బస్సు కనిపించకపోవడంతో అప్రమత్తమైన ఆర్టీసీ అధికారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించి, బస్సు కోసం గాలింపు చేపట్టారు. మదనపల్లి సమీపంలో బస్సును గుర్తించిన అధికారులు దానిని అడ్డుకుని స్వాధీనం చేసుకున్నారు. బస్సును తీసుకెళ్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని కదిరి పోలీసులకు అప్పగించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని విచారిస్తున్నారు. బస్సును ఎందుకు చోరీ చేశాడు, అతడి ఉద్దేశం ఏమిటి, ఈ ఘటన వెనుక మరెవరైనా ఉన్నారా అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడికావాల్సి ఉంది.