ఆళ్ల నాని మృతి పట్ల ఎంపీ పుట్టా మహేష్ కుమార్ దిగ్భ్రాంతి
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
ఏలూరు, సెప్టెంబర్ 15: ఏలూరు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (నాని) ఆకస్మిక మృతి పట్ల ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన మీడియాకు ప్రకటన విడుదల చేశారు.
ఆళ్ల నాని మృతి ఏలూరు ప్రజలకు తీరని లోటని ఎంపీ పేర్కొన్నారు. నాని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. 2004లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి రెండు దశాబ్దాలకు పైగా ఏలూరుతో పాటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయాల్లో, ప్రజాసేవలో ఆళ్ల నాని తనదైన ముద్ర వేశారని గుర్తుచేశారు.
ఆళ్ల నాని మృతి పట్ల ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం, మనోబలం కలగాలని ఆకాంక్షించారు. నాని ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు.