శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును రాష్ట్ర మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి సందర్శించిన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు .
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును రాష్ట్ర మంత్రులు శ్రీ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు, శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, గడ్డం వివేక్ వెంకటస్వామితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు సందర్శించారు.
ఈ సందర్భంగా ప్రాజెక్టులోని ప్రస్తుత నీటిమట్టం, ఇన్ఫ్లో–అవుట్ఫ్లో పరిస్థితులను సాగునీటి శాఖ అధికారులతో కలిసి క్షుణ్ణంగా పరిశీలించారు. వరద ప్రవాహం, నీటి విడుదల పరిస్థితులపై అధికారుల నుంచి వివరాలను తెలుసుకొని, పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించారు.
అనంతరం మంత్రులు మాట్లాడుతూ, భారీ వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో అధికారులు 24 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రాజెక్టు నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. దిగువ ప్రాంతాల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు, అవసరమైన చోట ముందస్తు హెచ్చరికలు జారీ చేసి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు సిద్ధంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు.