BREAKING
సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు
www.ntodaynews.com

సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన

ఆంధ్రప్రదేశ్
/ నంద్యాల
Reporter
యామనూరి మల్లికార్జున నంద్యాల జిల్లా ప్రతినిధి
01 Aug, 2026 - 06:39 AM
10 వీక్షణలు

సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన 

నంద్యాల జిల్లా 

ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి అధికారులకు కీలక సూచనలు – బీసీ వెల్ఫేర్ హాస్టల్, పాఠశాల, కళాశాలల సందర్శన 

నంద్యాల జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సునీల్ షొరాణ్, IPS శుక్రవారం సుండిపెంటలోని వివిధ ప్రాంతాలలో సుడిగాలి పర్యటన నిర్వహించారు. పోలీస్ స్టేషన్ సచివాలయం 2 బిల్డింగ్ కు మారుతున్న సందర్భంగా అక్కడి పరిసరాలను పరిశీలించారు. పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఫిర్యాదుదారులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొని చట్ట పరిధిలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఫిర్యాదులపై పోలీసుల స్పందన తదితర అంశాలపై ఆరా తీశారు.


 అనంతరం, వారాంతపు దినాలలో సుండిపెంటలో నెలకొన్న ట్రాఫిక్ సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించి వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు పలు సూచనలు జారీ చేశారు.

ఈ సందర్భంగా సుండిపెంటలోని ప్రధాన కూడళ్లు, RTC బస్టాండ్, అక్కమ్మ సెంటర్, పూర్ణానంద స్వామి ఆశ్రమం, పండ్ల బజార్, స్టోర్ శంకర్ మరియు ఎన్టీఆర్ సర్కిల్, లింగాల ఘాట్ రోడ్, డ్యాం పాయింట్ తదితర ప్రాంతాలను సందర్శించి ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల రాకపోకలు సజావుగా సాగేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ ట్రాఫిక్ నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.


అనంతరం స్థానిక ప్రజలతో ఎస్పీ మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పోలీసుల సేవలను మరింత ప్రజలకు చేరువ చేయడంతో పాటు నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజల సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఏవైనా అనుమానాస్పద సంఘటనలు లేదా నేరాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేసి సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.


తదుపరి సుండిపెంటలోని బీసీ వెల్ఫేర్ హాస్టల్‌ను సందర్శించి అక్కడ విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించారు. అనంతరం స్థానిక పాఠశాల మరియు కళాశాలను సందర్శించి విద్యార్థులు క్రమశిక్షణతో విద్యాభ్యాసం కొనసాగించడంతో పాటు రోడ్డు భద్రతా నిబంధనలు పాటించడం, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండడం, మంచి పౌరులుగా ఎదగాలని సూచించారు.


జిల్లా పోలీస్ కార్యాలయం నంద్యాల.

​​