www.ntodaynews.com
మన సంప్రదాయాలను కాపాడుకోవాలి
తెలంగాణ
/
నల్గొండ
/
చిట్యాల
మన సంప్రదాయాలను కాపాడుకోవాలి
నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని ఉరుమడ్ల మండల ప్రాథమిక పాఠశాలలో శనివారం గోరింటాకు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకన్న మాట్లాడుతూ నేటితరం పిల్లలు, యువకులు మన పురాతన ఆచారాలు, సంప్రదాయాలను పాటిస్తూ ముందుకు సాగాలని హెచ్ఎం సూచించారు. ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం గౌరీదేవి అనుగ్రహానికి, సౌభాగ్యానికి ప్రతీక అని పేర్కొన్నారు. వర్షాకాలంలో వచ్చే ఇన్ఫెక్షన్లను అరికట్టడానికి, శరీరంలోని వేడిని తగ్గించడానికి గోరింటాకు అద్భుతమైన సహజ సిద్ధమైన ఔషధంగా పనిచేస్తుందని వివరించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ పట్ల మౌనిక జనార్దన్, ఉపాధ్యాయులు యాదయ్య, శిరీష, భవానిలతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.