పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ..
పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు అప్పగించిన అర్బన్ సీఐ రమేష్
చిలకలూరిపేట పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ ప్రాంతాల్లో పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్లను పోలీసులు విజయవంతంగా రికవరీ చేసి, వాటిని అసలు యజమానులకు అప్పగించారు.
శనివారం చిలకలూరిపేట అర్బన్ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన కార్యక్రమంలో అర్బన్ సీఐ రమేష్ బాధితులకు మొబైల్ ఫోన్లను అందజేశారు.
ఈ సందర్భంగా సీఐ రమేష్ మాట్లాడుతూ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం మరియు ప్రత్యేక నిఘా సహాయంతో పోగొట్టుకున్న ఫోన్లను గుర్తించి రికవరీ చేసినట్లు తెలిపారు. ప్రజలు తమ మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న వెంటనే సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని లేదా CEIR పోర్టల్లో నమోదు చేయాలని సూచించారు.
అతి తక్కువ సమయంలో తమ మొబైల్ ఫోన్లను తిరిగి పొందిన బాధితులు చిలకలూరిపేట అర్బన్ పోలీసులకు, ముఖ్యంగా సీఐ రమేష్కు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రజల సహకారంతో నేర నియంత్రణతో పాటు పోగొట్టుకున్న ఆస్తులను తిరిగి అందించేందుకు పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని సీఐ రమేష్ పేర్కొన్నారు.