BREAKING
బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు.
www.ntodaynews.com

శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం

ఆంధ్రప్రదేశ్
/ శ్రీ సత్యసాయి
Reporter
NTODAY NEWS ప్రతి క్షణం - ప్రజల పక్షం
12 Jun, 2026 - 03:46 PM
148 వీక్షణలు

ఎన్ టుడే న్యూస్ రిపోర్టర్ రామాంజనేయులు 

సత్యసాయి జిల్లా అమడగూరు మండల కేంద్రంలోని శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఆరవ వసంతోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకులు, వృద్ధాశ్రమంలో నివసిస్తున్న వృద్ధులతో కలిసి కేక్ కట్ చేసి వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.

ఆశ్రమం ఆరు సంవత్సరాలుగా అందిస్తున్న సేవలను స్మరించుకుంటూ నిర్వహించిన ఈ కార్యక్రమంలో వృద్ధులకు ప్రత్యేక భోజనాలు ఏర్పాటు చేశారు. ఆశ్రమ సేవా కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తున్న మండల పత్రికేయులను శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకురాలు అరుణ జ్యోతి మాట్లాడుతూ, సమాజంలో నిరాశ్రయులు, వృద్ధులకు అండగా నిలిచి వారికి ఆశ్రయం, ఆహారం, ప్రేమాభిమానాలు అందించడమే తమ లక్ష్యమని తెలిపారు. దాతల సహకారం, ప్రజల ఆదరణతో వృద్ధాశ్రమం విజయవంతంగా ముందుకు సాగుతోందని, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.

కార్యక్రమంలో సామాజిక సేవకులు, దాతలు, గ్రామ ప్రముఖులు, పత్రికేయులు పాల్గొని వృద్ధాశ్రమం అందిస్తున్న సేవలను కొనియాడారు. వృద్ధుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న నిర్వాహకులకు అభినందనలు తెలియజేస్తూ, ఆశ్రమం మరిన్ని సేవా కార్యక్రమాలతో ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.