మాటూరుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన డీఎంహెచ్వో డాక్టర్ వేణుమాధవ్
మాటూరుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన డీఎంహెచ్వో డాక్టర్ వేణుమాధవ్
మధిర, జూలై 27: తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా మధిర మండలం మాటూరుపేట గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్వో) డాక్టర్ వేణుమాధవ్ సందర్శించారు.
ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ వీరబాబు, సిబ్బందితో ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలపై సమీక్ష నిర్వహించారు. నర్సింగ్ అధికారిని వ్యాక్సిన్ల నిల్వ, అందుబాటులో ఉన్న వైల్స్ వివరాలు అడిగి తెలుసుకుని, కోల్డ్ చైన్ వ్యవస్థను తప్పనిసరిగా సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు.
ఆసుపత్రి ప్రయోగశాలలో ఉన్న పరికరాల పనితీరును పరిశీలించి, అవి సమర్థవంతంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే సీజనల్ వ్యాధుల నివారణపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని అన్ని గ్రామాల్లో తరచూ వైద్య శిబిరాలు నిర్వహించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య సిబ్బందికి డీఎంహెచ్వో ఆదేశించారు.