BREAKING
బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు.
www.ntodaynews.com

కంఠాయపాలెం బ్రిడ్జి పరిశీలించిన ఎమ్మెల్యే

తెలంగాణ
/ మహబూబాబాద్ / తొర్రూర్
Reporter
బోధపల్లి వేణు పాలకుర్తి నియోజకవర్గ ప్రతినిధి
27 Jul, 2026 - 10:02 PM
12 వీక్షణలు

కంఠాయపాలెం బ్రిడ్జి పరిశీలించిన ఎమ్మెల్యే

పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి వేణు 

కంటాయపాలెమడిపెళ్లి కంటాయపాలెంగుర్తూరు బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే యశశ్విని రెడ్డి.

తొర్రూరు మండలం కంటాయపాలెం గ్రామంలో కొనసాగుతున్న కీలక వంతెన నిర్మాణ పనులను పాలకుర్తి శాసన సభ్యురాలు యశశ్విని రెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిని క్షుణ్ణంగా పరిశీలిస్తూ, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ నిర్ణీత గడువులో పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు

ఈ సందర్భంగా రూ.3.30 కోట్ల వ్యయంతో కంటాయపాలెం నుండి మడిపెళ్లి గ్రామానికి నిర్మిస్తున్న వంతెన, అలాగే రూ.3.50 కోట్ల వ్యయంతో కంటాయపాలెం నుండి గుర్తూరు గ్రామానికి నిర్మిస్తున్న వంతెన పనులను ఎమ్మెల్యే పరిశీలించారు

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఈ వంతెనల నిర్మాణం పూర్తయితే గ్రామాల మధ్య రాకపోకలు మరింత సులభతరం అవుతాయని, ముఖ్యంగా రైతులు, విద్యార్థులు, అత్యవసర సేవల రవాణాకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో శాశ్వత మౌలిక సదుపాయాల కల్పనకు కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు

ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు, రైతులు, ప్రజలు పాల్గొన్నారు.