కంఠాయపాలెం బ్రిడ్జి పరిశీలించిన ఎమ్మెల్యే
కంఠాయపాలెం బ్రిడ్జి పరిశీలించిన ఎమ్మెల్యే
పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి వేణు
కంటాయపాలెమడిపెళ్లి కంటాయపాలెంగుర్తూరు బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే యశశ్విని రెడ్డి.
తొర్రూరు మండలం కంటాయపాలెం గ్రామంలో కొనసాగుతున్న కీలక వంతెన నిర్మాణ పనులను పాలకుర్తి శాసన సభ్యురాలు యశశ్విని రెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిని క్షుణ్ణంగా పరిశీలిస్తూ, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ నిర్ణీత గడువులో పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు
ఈ సందర్భంగా రూ.3.30 కోట్ల వ్యయంతో కంటాయపాలెం నుండి మడిపెళ్లి గ్రామానికి నిర్మిస్తున్న వంతెన, అలాగే రూ.3.50 కోట్ల వ్యయంతో కంటాయపాలెం నుండి గుర్తూరు గ్రామానికి నిర్మిస్తున్న వంతెన పనులను ఎమ్మెల్యే పరిశీలించారు
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఈ వంతెనల నిర్మాణం పూర్తయితే గ్రామాల మధ్య రాకపోకలు మరింత సులభతరం అవుతాయని, ముఖ్యంగా రైతులు, విద్యార్థులు, అత్యవసర సేవల రవాణాకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో శాశ్వత మౌలిక సదుపాయాల కల్పనకు కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు
ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు, రైతులు, ప్రజలు పాల్గొన్నారు.