ఘట్కేసర్లో గణేశ్ విగ్రహ కేంద్రాల తనిఖీ
తెలంగాణ
/
మేడ్చల్-మల్కాజిగిరి
విగ్రహాల తయారీ, రవాణాలో భద్రతా నిబంధనలు పాటించాలి: ఏసీపీ మోహన్కుమార్
ఘట్కేసర్ | Ntoday News
వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో మేడిపల్లి ఏసీపీ బి. మోహన్కుమార్, ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓతో కలిసి ఘట్కేసర్లోని గణేశ్ విగ్రహాల తయారీ, విక్రయ కేంద్రాలను పరిశీలించారు. విగ్రహాల తయారీ, విక్రయాలు, రవాణా సమయంలో భద్రతా ప్రమాణాలు పాటించేలా నిర్వాహకులకు సూచనలు చేశారు.
విగ్రహాల తయారీదారులు, విక్రయదారులు, రవాణా నిర్వాహకులతో మాట్లాడిన ఏసీపీ.. విగ్రహాలను సురక్షితంగా నిర్వహించాలని సూచించారు. రవాణా సమయంలో విగ్రహాలను వాహనాల్లో పటిష్టంగా అమర్చడంతో పాటు, ప్రమాదాలకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.
అలాగే పోలీస్ శాఖ నిర్దేశించిన విగ్రహాల ఎత్తు పరిమితులను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. భారీ విగ్రహాల రవాణాలో విద్యుత్ తీగలు, రోడ్డు మార్గాలు తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గణేశ్ ఉత్సవాల సందర్భంగా విగ్రహాల రవాణా, నిమజ్జన మార్గాల భద్రతపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.
విగ్రహాల తయారీదారులు, విక్రయదారులు, నిర్వాహకులు పోలీసుల సూచనలు పాటించి ఉత్సవాలను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు సహకరించాలని అధికారులు కోరారు.