చింతలపూడి–బాలవారిగూడెం రహదారి పనులకు త్వరలో శ్రీకారం
చింతలపూడి నియోజకవర్గ రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు
ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో దాదాపు రెండు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న చింతలపూడి–బాలవారిగూడెం రహదారి నిర్మాణానికి త్వరలో శ్రీకారం చుట్టనున్నారు. రూ.2.80 కోట్ల వ్యయంతో 4 కిలోమీటర్ల మేర చేపట్టనున్న రోడ్డు పనులకు సంబంధించి చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ కాంట్రాక్టర్, స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి నిర్మాణం చేపట్టనున్న మార్గాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రహదారి నిర్మాణంతో స్థానిక ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని, గ్రామాల మధ్య అనుసంధానం మరింత బలోపేతం అవుతుందని తెలిపారు. ప్రజలకు నాణ్యమైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అభివృద్ధి పనులను వేగవంతంగా అమలు చేస్తోందని పేర్కొన్నారు. రోడ్డు నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంత ప్రజల చిరకాల సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది.