ఈడిగపల్లి గ్రామం వద్ద ద్విచక్ర వాహనాన్ని బొలెరో ఢీకొనడంతో దంపతులు మృతి
ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న బొలెరో వాహనం
- దంపతులు మృతి కుమారుడికి తీవ్ర గాయాలు
పుంగనూరు మండల పరిధిలోని ఈడిగపల్లి గ్రామం వద్ద ద్విచక్ర వాహనాన్ని బొలెరో ఢీకొనడంతో దంపతులు మృతి చెంది కుమారుడికి తీవ్ర గాయాలైన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే మదనపల్లి రామారావు కాలనీకి చెందిన అమీర్(45) సల్మా(40) వీరి కుమారుడైన ముస్తాఫిర్(19) ద్విచక్ర వాహనంలో మదనపల్లి నుండి పుంగనూరు వైపు ఈడిగపల్లి గ్రామం ఏఎంసీ చెక్ పోస్ట్ సమీపంలో వెళ్తుండగా వీరిని వెనుక వైపు నుండి అతివేగంగా వచ్చిన బొలెరో వాహనం ఢీకొనడంతో దంపతులైన అమీర్, సల్మా అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్ర గాయాలైన కుమారుడు ముస్తాఖిర్ ని 108 వాహనం ద్వారా మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పుంగనూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.