www.ntodaynews.com
జర్నలిస్టులకు వ్యక్తిగతంగా ఇళ్ల స్థలాలు – సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం
తెలంగాణ
న్యూఢిల్లీ:
జర్నలిస్టులకు సొసైటీల పేరుతో కాకుండా ఒక్కొక్కరికి వ్యక్తిగతంగా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో జరిగిన భేటీలో ఆయన ఈ విషయం తెలిపారు.
“జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే ఉద్దేశంతో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశాం. సమస్యలు ఉంటే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు దృష్టికి తీసుకురావాలి. సబ్ కమిటీ త్వరగా సిఫార్సులు ఇస్తే వెంటనే కేబినెట్లో ఆమోదిస్తాం” అని రేవంత్ రెడ్డి తెలిపారు.
వ్యక్తిగతంగా ఇళ్ల స్థలాలు ఇవ్వడం వల్ల భవిష్యత్తులో చట్టపరమైన సమస్యలు రాకుండా ఉంటాయని ఆయన పేర్కొన్నారు. సొసైటీల పేరుతో కాకుండా ఒక్కొక్కరి పేరుమీద ఇస్తే వివాదాలు తగ్గుతాయని చెప్పారు.