www.ntodaynews.com
పోతనపల్లి ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ధారావతు విప్లవ కుమార్ దశదిన కర్మలో మండల విద్యాశాఖ అధికారి మాసగిరి శ్రీనివాస్ ఘన నివాళులు
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పోతనపల్లి గ్రామ మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పని చేస్తూ ఇటీవల అకస్మాత్తుగా మృతి చెందిన ధారావతు విప్లవ కుమార్ దశదిన కర్మ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చాట్రాయి మండల విద్యాశాఖ అధికారి మాసగిరి నివాసరావు హాజరై చిత్రపటానికి ఘనంగా పుష్పాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాట్రాయి మండలం ఒక మంచి ఉపాధ్యాయుడిని కోల్పోయిందని పేర్కొన్నారు. ప్రభుత్వం తరపున రావాల్సిన అన్ని సహాయాలు అందే విధంగా చర్యలు తీసుకుంటానని తెలిపారు. కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ధారావతు కృష్ణయ్య, వీరకోటి, ధారావతు నాగేశ్వరరావు తదితరులు పాల్గొని విప్లవ కుమార్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు