రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ..
విజయవాడ భవానిపురం పోలీస్ స్టేషన్లో ఆదివారం నాడు డిసిపి గుణ్ణం రామకృష్ణ తనిఖీలు నిర్వహించారు, అంతేకాకుండా స్టేషన్లో ఉన్న ఎస్ ఐ ల తో మీటింగ్ నిర్వహించి భవానిపురం ప్రాంతంలో శాంతి భద్రతలకు సంబంధించి వచ్చేది వర్షాకాలం, ఈదురు గాలులు ఉంటాయి, వాటిపై ప్రజలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారు, అలాంటి సమస్యలను ఎలా అధిగమించాలి అనే పలు శాలపై చర్చించి శాంతి భద్రతల పర్యవేక్షణ పై కొన్ని సూచనలు చేశారు..
అనంతరం రౌడీషీటర్లకు ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించారు..
ఈ కౌన్సిలింగ్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని, మీకు ఏమైనా సమస్యలు తలెత్తితే స్థానిక పోలీసులకు తెలియజేయలే తప్ప చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దని ఆయన సూచించారు, అంతేకాకుండా మీ కుటుంబ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంటుందని ఏదో ఒక రకమైన పని చేసుకుంటూ భార్య బిడ్డల్ని బాగా చూసుకొని కుటుంబానికి పెద్దదిక్కుగా నిలవాలే తప్ప చెడు వ్యసనాలకు బానిసై మద్యం, గంజాయి అలాంటి మత్తు పదార్థాలు తీసుకోకుండా మంచి పనులు చేసుకుంటూ మీ కుటుంబానికి అండగా ఉండాలని, మీరు సత్ప్రవర్తనతో మెలిగితే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి మీ పైన షీట్ తీయించే అవకాశాలు ఉంటాయని శాంతి భద్రతలే లక్ష్యంగా రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించిన డిసిపి గుణ్ణం రామకృష్ణ, సిఐ ఉమామహేశ్వరరావు..