BREAKING
ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి
www.ntodaynews.com

నేటి నుంచే ఇంటింటి ఓటర్ల సర్వే ప్రారంభం – నెల రోజుల పాటు ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
15 Jun, 2026 - 08:21 AM
7 వీక్షణలు

ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితాను మరింత ఖచ్చితంగా, పారదర్శకంగా రూపొందించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ నేటి (సోమవారం) నుంచి ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఇంటింటి సర్వే జూలై 14 వరకు నెల రోజుల పాటు కొనసాగనుంది.

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 46,397 మంది బూత్ స్థాయి అధికారులు (BLOలు) ఈ సర్వేలో పాల్గొంటున్నారు. సర్వే సమర్థవంతంగా నిర్వహించేందుకు వీరికి ఇప్పటికే ఎన్నికల సంఘం ప్రత్యేక శిక్షణ ఇచ్చింది.

ప్రతి ఇంటికి ఎన్యుమరేషన్ ఫారాలు

సర్వేలో భాగంగా ప్రతి ఓటరుకు రెండు ఎన్యుమరేషన్ ఫారాలు అందజేయనున్నారు. వాటిలో ఓటరు పేరు, చిరునామా, పాత ఫోటో, ఎపిక్ నంబర్ ముందే ముద్రించి ఉంటుంది. మిగిలిన వివరాలను ఓటర్లు స్వయంగా పూర్తి చేయాల్సి ఉంటుంది.

బీఎల్వోలు ఈ నెల రోజుల్లో కనీసం మూడు సార్లు ప్రతి ఇంటిని సందర్శించి ఫారాలు అందజేయడం, తిరిగి సేకరించడం చేస్తారు. పూర్తి చేసిన ఫారాలను జూలై 14లోగా తప్పనిసరిగా సమర్పించాలి. సమర్పించని వారి పేర్లు జూలై 21న విడుదలయ్యే ముసాయిదా ఓటర్ల జాబితాలో ఉండవు.

మ్యాపింగ్ ప్రక్రియ పురోగతి

2002 ఓటర్ల జాబితాను ఆధారంగా తీసుకుని ప్రస్తుత ఓటర్ల వివరాల మ్యాపింగ్ కొనసాగుతోంది. రాష్ట్రంలో మొత్తం 4.16 కోట్లకు పైగా ఓటర్లు ఉండగా, ఇప్పటివరకు 2.68 కోట్ల మందికి పైగా (64.6 శాతం) మ్యాపింగ్ పూర్తయింది. మిగిలిన సుమారు 1.47 కోట్ల ఓటర్ల వివరాలను ఈ సర్వే ద్వారా పూర్తిచేయనున్నారు.

విదేశాల్లో/ఇతర ప్రాంతాల్లో ఉన్నవారికి అవకాశం

ఉద్యోగ, వ్యాపార కారణాల వల్ల ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓటర్ల తరఫున కుటుంబ సభ్యులు ఎన్యుమరేషన్ ఫారాలను నింపి బీఎల్వోలకు అందించవచ్చు. రాజకీయ పార్టీల బూత్ లెవెల్ ఏజెంట్లు గరిష్టంగా 50 ధ్రువీకరించిన ఫారాలను సమర్పించేందుకు అనుమతి ఉంది.

బీఎల్వోలకు ఓటర్ల పేర్లను నేరుగా తొలగించే అధికారం లేదు. ఫారం సమర్పించని సందర్భాల్లో క్షేత్రస్థాయి విచారణ, నోటీసులు, వివరణ అవకాశాలు ఇచ్చిన తర్వాతే తదుపరి చర్యలు తీసుకుంటారు.