BREAKING
ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి
www.ntodaynews.com

ఒకేసారి బిడ్డలకు జన్మనిచ్చిన తల్లీ కూతుళ్లు

అంతర్జాతీయం అంతర్జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
16 Mar, 2026 - 05:13 PM
101 వీక్షణలు

తల్లి కావడం ప్రతి మహిళ జీవితంలో అత్యంత ఆనందకరమైన క్షణం. ఒక బిడ్డ పుట్టినా కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. అలాంటిది ఒకే ఇంట్లో తల్లి, కూతురు ఇద్దరూ ఒకేసారి తల్లులు కావడం అరుదైన ఘటనగా మారింది.

ఈ సంఘటన ఇటలీ దేశంలోని నేపుల్స్ నగరంలోని ఒక పెద్ద ఆసుపత్రిలో జరిగింది. మారా బారోన్ అనే మహిళకు 15 ఏళ్ల వయసులోనే కూతురు పాలా జన్మించింది. అప్పట్లో గర్భస్రావం చేయించుకోవాలని కొందరు సూచించినప్పటికీ, ఆమె తన గర్భాన్ని కొనసాగించాలని నిర్ణయించుకుంది.

సంవత్సరాలు గడిచిన తర్వాత ఆశ్చర్యకరంగా తల్లి మారా, కూతురు పాలా ఇద్దరూ ఒకే రోజున బిడ్డలకు జన్మనిచ్చారు. మారా 3.8 కిలోల బరువున్న ఆడబిడ్డకు జన్మనివ్వగా, 21 ఏళ్ల వయసున్న పాలా 3.4 కిలోల బరువున్న మగబిడ్డకు జన్మనిచ్చింది.

ఇద్దరికీ సాధారణ ప్రసవాలే జరిగాయని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం తల్లి, కూతురు మరియు ఇద్దరు నవజాత శిశువులు పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని చెప్పారు.

ఒకే కుటుంబంలో తల్లి, కూతురు ఒకే రోజున బిడ్డలకు జన్మనివ్వడం చాలా అరుదైన ఘటనగా వైద్యులు పేర్కొన్నారు. ఇద్దరు చిన్నారుల రాకతో ఆ కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంది.