అమెరికా పర్యటన ముగించుకుని స్వదేశానికి బయలుదేరిన మంత్రి సీతక్కకు ఘన వీడ్కోలు
అమెరికా పర్యటన ముగించుకుని స్వదేశానికి బయలుదేరిన మంత్రి సీతక్కకు ఘన వీడ్కోలు
అమెరికా పర్యటనను విజయవంతంగా పూర్తి చేసుకున్న తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) స్వదేశానికి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమండ్ల ఝాన్సీరెడ్డి ఆత్మీయంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేస్తూ మర్యాదపూర్వకంగా వీడ్కోలు పలికారు.
అమెరికాలో నిర్వహించిన తెలంగాణ తెలుగు అసోసియేషన్ (టీటీఏ) మెగా కన్వెన్షన్లో పాల్గొన్న మంత్రి సీతక్క, తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రవాస తెలంగాణ ప్రజలకు వివరించారు. రాష్ట్రంలో చేపడుతున్న పలు సంక్షేమ పథకాలు, గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల గురించి సమావేశాల్లో వివరించి తెలంగాణ అభివృద్ధి దిశను ప్రవాసులకు తెలియజేశారు.
పర్యటన సందర్భంగా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు ప్రవాస భారతీయులతో సమావేశమై వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. తెలంగాణతో ప్రవాస భారతీయుల అనుబంధాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
మంత్రి సీతక్క అమెరికా పర్యటన విజయవంతంగా ముగియడంతో స్వదేశానికి తిరుగు ప్రయాణం సందర్భంగా హనుమండ్ల ఝాన్సీరెడ్డి విమానాశ్రయానికి వెళ్లి ఆత్మీయంగా వీడ్కోలు పలకడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.