BREAKING
గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన.
www.ntodaynews.com

జిల్లాస్థాయి పోటీలకు పీఎం శ్రీ జిల్లా పరిషత్ గర్ల్స్ హై స్కూల్ ప్లస్ తిరువూరు విద్యార్థినులు ఎంపిక

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Jul, 2026 - 08:25 PM
18 వీక్షణలు

తిరువూరు: తిరువూరు నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ క్రీడా పోటీల్లో పీఎం శ్రీ జిల్లా పరిషత్ గర్ల్స్ హై స్కూల్ ప్లస్ (తిరువూరు) విద్యార్థినులు విశేష ప్రతిభ కనబరిచి జిల్లాస్థాయి పోటీలకు అర్హత సాధించారు.

ఈ నెల 28న గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలోని ఉన్నత పాఠశాలలో నిర్వహించిన అమరావతి ఛాంపియన్షిప్ పోటీల్లో వాలీబాల్, యోగ, ఖోఖో విభాగాల్లో విద్యార్థినులు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. వారి ప్రతిభను గుర్తించిన నిర్వాహకులు జిల్లాస్థాయి పోటీలకు ఎంపిక చేశారు.

ఈ సందర్భంగా విద్యార్థినులను పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బి. మృదుల, ప్రథమ సహాయ ఉపాధ్యాయురాలు కె. లావణ్య, ఉపాధ్యాయులు, సిబ్బంది అభినందించారు. విద్యార్థినులకు సమర్థవంతంగా శిక్షణ అందించిన పీడీలు బి. జయలక్ష్మి, జి. సుకన్యలను ప్రత్యేకంగా ప్రశంసించారు.

జిల్లాస్థాయి పోటీల్లో కూడా ఇదే జోరు కొనసాగించి రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించి పాఠశాలకు, తిరువూరుకు మంచి పేరు తీసుకురావాలని ప్రధానోపాధ్యాయురాలు ఆకాంక్ష వ్యక్తం చేశారు. విద్యార్థినుల విజయంతో పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.