జనార్దనవరంలో ఘనంగా "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమం
చాట్రాయి మండల రిపోర్టర్ గోళ్ళ సత్యనారాయణ
ఏలూరు జిల్లా చాట్రాయి మండలం జనార్దనవరం గ్రామంలో రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఇచ్చిన పిలుపు మేరకు "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసి ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటికీ వెళ్లి వివరించారు.
గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మాదాసు చిన్నపుల్లయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నాయకులు ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై కరపత్రాలను పంపిణీ చేశారు. ప్రజల సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వివరించారు. కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం సమన్వయంతో ముందుకు సాగుతోందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో నీటి సంఘం అధ్యక్షుడు వంగల సుబ్బారావు, గ్రామ పార్టీ ఉపాధ్యక్షుడు పామర్తి నాగరాజు, కార్యదర్శి బలువూరి రత్తయ్య, ఐటీడీపీ కార్యదర్శి చీపు వెంగళరావు, చాట్రాయి మండల తెలుగు యువత ఉపాధ్యక్షుడు బొద్దు వెంకటేశ్వరరావు, బూత్ ఇన్చార్జి పులపాక రఘు, గ్రామ తెలుగు రైతు అధ్యక్షుడు నడిపింటి వెంకటేశ్వరరావు, జనరల్ సెక్రటరీ కాసగాని గోపాలస్వామి, కోశాధికారి వంగల రమేష్, వంగల లక్ష్మీనారాయణ, నడిపింటి రాజేష్, చీపు నర్సింహారావు, రాచకొండ కృష్ణ, కాలసాని చెన్నారావు, బొరిగొర్ల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.