www.ntodaynews.com
పథకాలను వినియోగించుకుని ముందుకు సాగాలి
తెలంగాణ
వికలాంగులు ప్రభుత్వ పథకాలను వినియోగించుకుని ముందుకు సాగాలి
– ఎమ్మెల్యే విప్ బీర్ల ఐలయ్య
NTODAY NEWS : యాదాద్రి భువనగిరి జిల్లా
యాదగిరిగుట్ట మండల కేంద్రంలో ఎన్పీఆర్డీ (NPRD) తెలంగాణ రాష్ట్ర కమిటీ ముద్రించిన 2026 క్యాలెండర్ను ఎమ్మెల్యే విప్ బీర్ల ఐలయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలోని వికలాంగులు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పూర్తిగా వినియోగించుకొని ఆర్థికంగా, సామాజికంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. అలాగే, వికలాంగుల హక్కుల సాధన కోసం ఎన్పీఆర్డీ చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎన్పీఆర్డీ జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్, జిల్లా కోశాధికారి కొత్త లలిత, జిల్లా నాయకులు పాల విజయకుమార్, జాంగిర్ రాజు, హరి తదితరులు పాల్గొన్నారు.
#DisabilityRights
#NPRD
#SocialWelfare
#InclusiveDevelopment
#TelanganaNews
#PublicWelfare
#Empowerment
Follow us on
Website
Facebook
Instagram
YouTube