BREAKING
సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత
www.ntodaynews.com

అనాథ శతాధిక వృద్ధురాలికి శాస్త్రోక్తంగా అంత్యక్రియలు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Jul, 2026 - 04:17 PM
20 వీక్షణలు

అనాథ శతాధిక వృద్ధురాలికి శాస్త్రోక్తంగా అంత్యక్రియలు

జంగారెడ్డిగూడెం, జులై 22:

జంగారెడ్డిగూడెంలోని శ్రీ సీతామహాలక్ష్మి వృద్ధాశ్రమంలో నివసిస్తున్న శతాధిక వృద్ధురాలు కుచ్చలపాటి సూర్యకాంతమ్మ (108) మంగళవారం రాత్రి కన్నుమూశారు. కుటుంబ సభ్యులు స్పందించకపోవడంతో వృద్ధాశ్రమ నిర్వాహకుడు జయవరపు శేఖర్, కామవరపుకోట సహాయ ఫౌండేషన్ ట్రస్ట్ చైర్మన్ వీరమల్ల మధు ఆధ్వర్యంలో స్థానిక హిందూ స్మశానవాటికలో శాస్త్రోక్తంగా అంత్యక్రియలు నిర్వహించారు.

ఈ సందర్భంగా అప్లాండ్ క్షత్రియ సేవా సమితి సభ్యుడు దండు ధనరాజు మాట్లాడుతూ, వృద్ధాశ్రమ నిర్వహణతో పాటు అనాథలు, అభాగ్యులకు సేవలందిస్తూ వారి అంత్యక్రియలను సైతం నిర్వహిస్తున్న శేఖర్, మధు సేవలు ఆదర్శనీయమని కొనియాడారు. కుటుంబ సభ్యులు ఆఖరి చూపుకు కూడా రాకపోవడం బాధాకరమని అన్నారు.

జయవరపు శేఖర్, వీరమల్ల మధు మాట్లాడుతూ వృద్ధులు, వికలాంగులు, నిరాశ్రయులకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు మనసుకు తృప్తినివ్వడమే కాకుండా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో చేకూరి శ్రీనివాసరాజు, కాలేజీ సత్యనారాయణరాజు, వేగేసిన రామరాజు, పొత్తూరి సుబ్బరాజు, కోలనువాడ శ్రీనివాసరాజు, పేరిచర్ల సత్యనారాయణరాజు, శ్రీనివాసరాజు, వీరమల్ల సౌజన్ తదితరులు పాల్గొన్నారు.